Monday, August 17, 2015

ఇప్పుడా గ్రామం అభివృద్ధి చెందడంతో ఆ గ్రామస్తులు సచిన్‌ను దేవుడని కొనియాడుతున్నారు.


పీఆర్‌ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్‌


                                        
                                 
 పీఆర్‌ కండ్రిగ , సచిన్‌ టెండూల్కర్‌ దత్తత తీసుకున్న గ్రామంలో రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు, వ్యవసాయ పనులు, చేపల పెంపకం ఇలా ఒకటేమిటీ అభివృద్ధిలో కండ్రిగ దూసుకుపోతోంది. ఆరు నెలల క్రితం ఆ గ్రామాన్ని సచిన్‌ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఎంపీ నిధులను ఆయన గ్రామాభివృద్ధికే వినియోగిస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందడంతో ఆ గ్రామస్తులు సచిన్‌ను దేవుడని కొనియాడుతున్నారు. 

నెల్లూరు జిల్లా గుడూరుకి 18 కి.మీ. దూరంలో పుట్టంరాజుగారి కండ్రిగ గ్రామం ఉంది. వెంకటగిరి రాజుల పాలనలో పుట్టంరాజు పెత్తనం చేయడంతో ఈ గ్రామానికి పుట్టంరాజుగారి కండ్రిగ అనే పేరు వచ్చింది. ఆరె నెలల క్రితం వరకు ఈ గ్రామం సమస్యలతో కొట్టుమిట్లాడుతుండేది. గత ఏడాది నవంబర్‌లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎంపీ నిధుల నుంచి రూ. 2.,79 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం మరో రూ. 3 కోట్లు నిధులు ఇచ్చింది. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడా గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతోంది.

No comments:

Post a Comment