Monday, August 17, 2015

ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి



తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆత్మకూరు ఎస్‌ మండలంలోని ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన జగదీశ్ రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో జ్యోతిని వెలిగిస్తామన్నారు. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment