Friday, September 11, 2015

అన్నంతపూర్ చుడదగు స్థలములు


అన్నంతపూర్ చుడదగు స్థలములు 
పుట్టపర్తి: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం. సత్యసాయి బాబా సమాధిని దర్శించుకోవడానికి విదేశాల నుంఖ్ద్మీ; భక్తులు వస్తుంటారు. అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా 64 కి.మీ. దూరంలో పుట్టపర్తి ఉంది.

పుట్టపర్తి ప్రశాంతి నిలయం 

పుట్టపర్తిలో శిల్పారామం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో భక్తులు, పర్యాటకులు సందర్శించేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్ల వ్యయంతో శిల్పారామం నిర్మించింది. చూడముచ్చటగా రంగు రంగుల పూల మొక్కలు, బొమ్మలు, రకరకాల దుకాణాలు ఏర్పాటుచేశారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఉదయం 10.30 నుంచి రాత్రి 8.30 గంటలవరకు సందర్శించవచ్చు. ప్రవేశరుసుం రూ.10 చెల్లించాలి. విద్యార్థులకు 30 శాతం రాయితీ ఇస్తారు. 

వలస పక్షుల కేంద్రం వీరాపురం 
జిల్లాలోని వీరాపురం వలస పక్షులకు ఆవాసంగా అలరారుతోంది. ముఖ్యంగా సైబీరియా నుంచే వచ్చే పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-7పై ఉన్న కొడికొండ చెక్‌పోస్టు నుంచి 13కి.మీ. దూరంలో వీరాపురం ఉంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వచ్చే పక్షులను ఈ వూరి ప్రజలు తమ అతిథులుగా చూసుకుంటారు. ఇక్కడకు వచ్చే పక్షిజాతుల్లో పెయింటెడ్‌ స్టార్క్‌ ముఖ్యమైంది. వీరాపురం వాసులు ముద్దుగా ఎర్ర కొంగ అంటారు. అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్‌ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతమైన విషయం.రష్యాలోని సైబీరియా లోయ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 150 రకాల నివసిస్తున్నాయి. వివిధ రంగుల్లో ఎత్తయిన సైబీరియా కొంగలు అంతరించి పోతున్న జాబితాలో చేరాయి. వాటి సంఖ్య నానాటికీ తగ్గుతున్నట్లు అమెరికాలోని విస్కాన్సిలో గల క్రేన్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో వందల సైబీరియా పక్షులు వలస బాట పడతాయి. సుమారు శ్రీలంక, థాయ్‌లాండ్‌, ఇండియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు వలస వస్తాయి. అక్కడే ఆర్నెల్ల పాటు ఉండి, సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సైబీరియాకు పయనమవుతాయి. 

పెయింటెండ్‌ స్టార్క్‌ 
పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది పెయింటెడ్‌ స్టార్క్‌ శాస్త్రీయ పేరు ‘మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3-3.5అడుగులు, ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5-4కిలోల వరకు ఉంటుంది.
ఎక్కడెక్కడ? 
పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు మన దేశానికి శాశ్వత అతిథులు. మనదేశంలో పలు చోట్ల అవి కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ పక్షి కేంద్రం, హార్యానాలోని ఫరీదాబాద్‌ జిల్లా హోదల్‌ పరిసరాల్లో, గుజరాత్‌లోని విద్యానగర్‌ సమీపంలో చెన్నైకు 40కి.మీ.ల దూరంలోని వేదాంతంగల్‌, కర్ణాటకలోకి శ్రీరంగపట్టణం, ముద్దూరు వద్ద, గుంటూరుకు 10కి.మీ.ల దూరంలోని ఉప్పలవాడ వద్ద, సూలూరు పేట సమీపంలో పులికాట్‌ సరస్సు వద్ద ఇవి ఎక్కువుగా కనిపిస్తాయి. 


లేపాక్షి ఆలయం 
రావణుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకెళ్తుండగా, జఠాయువు పక్షి అడ్డగించింది. కోపోద్రుక్తుడైన రావణుడు దాని రెక్కలు నరికివేస్తాడు. సీతాన్వేషియై తిరుగుతున్న రాముడు ఈ ప్రాంతానికి రాగా రెక్కలు తెగి ఉన్న జఠావును చూసి లే.. పక్షి అన్నాడని దాంతో ఈ ప్రాంతం లేపాక్షిగా మారిందని ఇతిహాస గాథ.ప్రపంచ ప్రసిద్ధి చెందిన నంది 
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది మరెక్కడా లేదు. 15అడుగుల ఎత్తు, 27అడుగుల పొడవుతో జీవకళ ఉట్టిపడుతూ పైకి లేచివస్తున్నట్లు కనబడే ఈ నంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
మూడు గుడుల ముచ్చట 
లేపాక్షిలో ప్రధాన దేవుడు వీరభద్రుడు. అక్కడే మరో రెండు చిన్న దేవాలయాలున్నాయి. పాప వినాశనేశ్వరస్వామి ఆలయం, రఘునాథాలయం, శివకేశవులకు తేడా లేదని ఒకే చోట శైవ, విష్ణు ఆలయాలు ఎదురెదురుగా ఉండటం లేపాక్షిలోని మరో ప్రత్యేకం.ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది ముఖ మండపం(నాట్యమండపం) అర్ధమండపం (గర్భగృహం), కల్యాణమంటపం, మంటపాలన్నీ సుందర శిల్ప శోభితంగా అలరిస్తాయి. 

గర్భగుడిలో 
గర్భగుడిలో వీరభద్రస్వామి, దుర్గాదేవి, శివకేశవులు ప్రధాన దేవుళ్లు. పైకప్పు అంతా చిత్ర కళాసమన్వితంగా ఉంటుంది. 34అడుగుల వీరభద్రుని పెయింటింగ్‌ చిత్రం ఆసియాలోకెల్లా పెద్దది. ఒక వాస్తుపురుషుడు, పద్మినీజాతి స్త్రీ, శిల్పాలను ప్రభుత్వ చిహ్నాలుగా ఎంపిక చేశారు.
అబ్బురపరిచే వేలాడే స్తంభం 
ఆలయంలో ఉన్న వేలాడే స్తంభం నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనం. గర్భగుడికి ముందు ఉన్న ఈ స్తంభం వేలాడుతూ ఉంటుంది. భూమిని ఏమాత్రం తాకకుండా గాలిలో ఉంటుంది. దీనిని పక్కకు జరిపించాలని నాటి బ్రిటీషు కాలంలో ఓ ఇంజినీర్‌ ప్రయత్నించగా గుడిలోని శిలలన్నీ కదిలినట్లు కథ ప్రచారంలో ఉంది.
తనే శిక్ష విధించుకున్న విరూపణ్ణ 
1538లో విజయనగర రాజుల ప్రధాన కేంద్రమైన పెనుకొండ. దాని కోశాధికారిగా ఉన్న విరూపణ్ణకు దేవాలయాన్ని నిర్వహించేందుకు నిధులు వెచ్చించాడు. విరూపణ్ణపై కొందరు రాజుకు లేనిపోనివి చెప్పడంతో రెండు కన్నులు పీకేయాలని శిక్ష విధించారు. ఇది తెలుసుకున్న విరూపణ్ణ తన కళ్లు తాను పీకి గోడకు కొట్టినట్లు చరిత్ర చెబుతోంది. నేటికీ ఆ రక్తపు మరకలు ఉండటం విశేషం.
నాట్య మండపం 
70 స్తంభాలతో నిర్మించిన నాట్య మండపంలో ప్రతి స్తంభంలోను శిల్పుల నేర్పరితనం కనిపిస్తోంది. మంటపం మధ్య ఉన్న 12 స్తంభాల మీద నాట్యకత్తెల భంగిమలతో పాటు సంగీత వాయిద్యకారుల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మూడు కదళ్లతో గుర్రపు దంతాలు, కమ్మీలతో, తలలో జడగల భృంగీశ్వరుని నాట్యాచార్యునిగా చూపారు. ఇదే స్తంభంలో మరో వైపు భిక్షాటన చేస్తున్న శివుడ్ని మలిచారు.
ఉట్టిపడే లేపాక్షి ఆకృతులు 
కళ్యాణమంటపానికి ఒక ఆనుకొని ఉత్తర దిశలో పలు స్తంభాల్లో అద్భుత ఆకృతులు శిల్పులు ఆనాడే చెక్కారు. వాటినే నేడు లేపాక్షి డిజైన్స్‌గా పిలుస్తున్నాం. ఖ్ద్మీ;రలకు వీటిని ఉపయోగిస్తున్నారు.
అద్భుతం... ఆ చిత్ర రాజాలు 
ఆకుల రసాలతో నాట్య మంటపంలోని పైకప్పుపై చిత్రలేఖనం నేటికీ ఎంతో చక్కగా కనపడటం విశేషం. భూకైలాస్‌, మానునీతిచోళుని కథ, భక్తిశిరియాళుని కథ, కిరితార్జునీయం, భక్తమార్కండేయ ఇలా ఎన్నో భక్తి కథలను చిత్రాల రూపంలో దర్శనమిస్తాయి.
ఆకట్టుకొంటున్న సీతాదేవి పాదం 
ఆలయం వెలుపల సీతాదేవి పాదం. అప్పట్లో శిల్పులు వాడిని తట్టలు చూస్తేనే ఎంత భారీ మనుషులో తెలుసుకోవవచ్చు. 

పచ్చని అందాలు... విజయనగర రాజుల కట్టడాలు 
కోట కలిగిన కొండ... కొండ కలిగినకోట.. కోట కొండలలో మేటి పెనుకొండగా పేరుగాంచిది పెనుకొండ. విజయనగర రాజులకాలం నాటికట్టడాలు దీనిపై అనేకం ఉన్నాయి. 
శ్రీకృష్ణదేవరాయలు 15 శతాబ్దంలో హంపి తరువాత పెనుగొండను రెండో రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. వేసవివిడిదిగా ఇక్కడి వస్తుండేవారు. ఇక్కడ ఒక్క చోటే 365 దేవాలయాలు ఉండటం విశేషం. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా కొన్ని ఆలయాల్లో మాత్రమే ధూప, దీప, నైవేద్యాలు జరుగుతున్నాయి. కొండపై ఉన్న పలుదేవాలయాలు, తటాకాలు, గోపురాలు, బురుజులు, కోనేరులు విజయనగరరాజుల చరిత్రకు అద్దం పడుతున్నాయి.కొండపై ఉన్న విశేషాలు.. 
పెనుకొండ కొండపైకి ఎక్కడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి మెట్లుదారి కాగా, మరొకటి చుట్లదారి ప్రస్తుతం మెట్లదారి ముళ్లకంపలమొక్కలతో మూసుకుపోగా కొండపైకి వెళ్లేవారు చుట్లదారినే వెంబడే వెళ్తున్నారు.
కొండపైన నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని హరిహరరాయలు, బుక్కరాయల పరిపాలన కాలంలో క్రియాశక్తిగా నిర్మించనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గుప్త నిధుల వేటలో ఈ దేవాలయం చాలా వరకు ధ్వంసమైంది. దేవాలయం సమీపంలోని బ్రహ్మతీర్థంగా పిలవబడే కోనేరు నేటికి ఉంది. బ్రహ్మతీర్థం నీటితో కళకళలాడుతూపర్యాటకులను ఆకట్టుకుంటుంది.
కొండపైన ఉన్న ఖిల్లా నాటి వైభవానికి నిదర్శనం. పెనుకొండలోని గగన్‌మహల్‌ నుండి ఖిల్లా వద్దకు సొరంగమార్గం ఉన్నట్లు అనేక మంది చెబుతారు. ఖిల్లాకు ఉత్తర భాగంలో దిగువభాగాన నాగులబావి, అక్కమ్మగార్లగుడి, కోనేరు, నాగదేవతలు గుడి ఉన్నాయి. అదేవిధంగా రాంబురుజు సమీపంలో నుండి కొండపైకి వెళితే లక్ష్మణబురుజు, సీతబురుసుజులతోపాటు కొండపైకి కట్టిన కోటగోడ కనిపిస్తాయి. 
నరసింహస్వామి దేవాలయానికి దక్షిణ భాగంలో బంగారుగుండ్లగా పిలవబడే ప్రాంతంలో కాళికాదేవి దేవాలయం ఉంది. వీటితోపాటు కొండపై మండపాలు, గోపురాలు అనేకం ఉన్నాయి. 
అదేవిధంగా కొండ అవతలి భాగంలోను కొండూరు ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. వీటికితోడు పచార్లకుంట, భైరవానికుంటలు అలరిస్తాయి.

తిమ్మమ్మ మర్రిమాను: 
తిమ్మమ్మ మర్రిమాను అంటేనే తిమ్మమ్మ పేరుతో వెలసిన మర్రిమాను అని అర్థం. దాదాపు 5.2 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి, 1100 వూడలతో పర్యాటకులను ఆకర్షిస్తుందీ వృక్షం. అనంతపురం నుంచి కదిరి మీదుగా 120 కి.మీ. దూరంలో ఉంది. 
క్రీ.శ. 1355లో పతి భక్తి కలిగిన తిమ్మమాంబ నాటిన ఎండిన మర్రి కొమ్మే నేటి ప్రపంచ మర్రిగా గిన్నిస్‌ పుటల్లోకెక్కింది. బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది. ఇది 1989లో సత్యనారాయణ అరియర్స్‌ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేశారు. 1355 వూడలతో మర్రిమాను ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి. 
* మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్‌ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయ నిర్మాణం చేపట్టారు. 

గుత్తికోట
 
అనంతపురం జిల్లాలోని గుత్తిదుర్గం చూడ ముచ్చటగా ఉంది. అనంతపురం నుంచి 52కిలో మీటర్లు, గుత్తిరైల్వే స్టేషన్‌నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో దుర్గం ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దులో గుత్తిపట్టణం తూర్పు భాగాన కొండలపై దుర్గంను నిర్మించారు. మూడువందల మూడు మీటర్ల ఎత్తున మూడువైపులా కొండలను కలుపుకుని 25హెక్టార్ల విస్తీర్ణంలో శంఖాకృతిలో నిర్మించారు. ఐదుమీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో పటిష్టంగా రాతికట్టడపు ప్రాకారాలతో లెక్కకుమించిన వృత్తాకారపు కోటబురుజులతో శత్రుదుర్భేద్యంగా దుర్గాన్ని నిర్మించారు. సుమారు 30 కిలో మీటర్ల దూరం నుంచే దుర్గం కనిపిస్తుంది. 18వ శతాబ్దంలో దుర్గం ప్రముఖ పాత్రవహించింది. 11,12 శతాబ్దంలో చాళుక్యులు ఈ కోటగోడను నిర్మించినట్లు తెలుస్తోంది. హరిహరబుక్కరాయలు ఈ కోటను మొదటిగా రాజధానిగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. మహామంత్రి తిమ్మరుసు బాల్యం గుత్తిదుర్గంలో గడిపినట్లు భట్టుమూర్తి పద్యాన్ని బట్టితెలుస్తోంది. క్రీస్తుపూర్వంనుంచి క్రీస్తుశకం వరకు అశోకుడు, చూటకూళులు, కంచిపల్లవులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, గంగవరపు రాజులు, చోళరాజులు, పశ్చిమచాళుక్యులు, భల్లాలరాజులు, దేవగరియాదవులు, విజయనగరరాజులు, నల్గొండ నవాబులు, మొగలాయిలు, కడపనవాజ్‌ మజీద్‌ఖాన్‌, దక్కస్‌సుబేదారు, పాలేగాండ్లు, మరాఠాలు , టిప్పుసుల్తాన్‌, నైజాంనవాబులు, ఆంగ్లేయులు దుర్గంను పాలించారు. దుర్గంలో 101 బావులున్నాయి. కోటముఖద్వారం, నగరేశ్వర ఆలయం, యల్లమ్మదేవాలయం, గోపాలస్వామిదేవాలయం, రామాలయం, ఆంగ్లేయుల సమాధులు, సీమప్రజల బంధు సర్‌థామస్‌మన్రో సమాధి, ఏనుగులశాల, సైనికకవాతు ప్రదేశం, రంగమండపం, ఖైదీలను నిర్బంధించే ఖ్ద్మీ;కటిగది, ధాన్యాగారం, బేగం మహాల్‌,ఖిల్లా ఉన్నాయి. దుర్గంలో 15 కోటలున్నాయి. చారిత్రక ఆలయాలు అనేకం ఉన్నాయి. దుర్గంలోకి వెళ్లేందుకు రాతికట్టడపు బాట ఉంది. ఖిల్లానుంచి చూస్తే సుమారు 30 కిలోమీటర్లు దూరం పచ్చని పొలాలు కనిపిస్తాయి. 
కళ్యాణదుర్గం - - ప్రసిద్ధి చెందిన చరిత్రాత్మక కోట ఇక్కడ ఉంది. అనంతపురానికి పశ్చిమ దిశగా 56కి.మీ దూరంలో కళ్యాణదుర్గం ఉంది. 

కొనకొండ్ల- ప్రాఖ్ద్మీ;న జైనతీర్థం జంబూద్వీపచక్రం ఇక్కడ ఉంది. ఇదిగుంతకల్లు రైల్వే స్టేషనుకు 6కి.మీ దూరంలో ఉంది.


No comments:

Post a Comment