Friday, March 4, 2016

చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది.



మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.
2. చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి.
3. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.
4. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.
5. కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది.
6. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని వినికిడి.

No comments:

Post a Comment